వీరభద్ర మఠం
శ్రీ శైల మహా క్షేత్రంలో పంచ మఠాలతో పాటుగా ప్రసిద్ధి చెందిన మరో మఠం వీరభద్ర మఠం .ఇది భీమశంకర మఠానికి దక్షిణంగా సుమారు 150 మీటర్ల దూరంలో ఉంది.జన వ్యవహారంలో వీరభద్ర మఠం గా పిలువబడుతున్న ఈ మఠం వాస్తవానికి ఒక శివాలయం.పశ్చిమ ముఖంగా ఉన్న ఈ ఆలయం గర్భాలయం ముఖ మండపాలను కూడి ఉంది.
6 అడుగుల పొడవు అంతే వెడల్పుతో కూడి యున్న గర్భాలయంలో ఒక చిన్న శివ లింగం భక్తుల పూజలందుకుంటోంది.ఈ గర్భాలయ ద్వార బంధరం అలంకరణ లేకుండా ఉండి ,ఈ ఆలయం యొక్క ప్రాచీనతను సూచిస్తోంది.గర్భాలయంలోని శివలింగం కూడా ఎంతో ప్రాచీనమైనదిగా గోచరిస్తోంది.
ఇక ఈ ముఖమండప దక్షిణ , పశ్చిమ భాగాలు రాతి గోడలచే మూయబడి వున్నాయి.ఈ గోడలలో దక్షిణగోడకు దాదాపు 6 అడుగుల ఎత్తున్న వీరభద్ర స్వామి దర్శనమిస్తాడు.ఇక్కడ వీరభద్ర స్వామి కొలువైయున్న కారణంగానే ఈ మఠం వీరభద్ర మఠం గా పిలువబడుతోంది.
ఇక ఈ ముఖమండప దక్షిణ , పశ్చిమ భాగాలు రాతి గోడలచే మూయబడి వున్నాయి.ఈ గోడలలో దక్షిణగోడకు దాదాపు 6 అడుగుల ఎత్తున్న వీరభద్ర స్వామి దర్శనమిస్తాడు.ఇక్కడ వీరభద్ర స్వామి కొలువైయున్న కారణంగానే ఈ మఠం వీరభద్ర మఠం గా పిలువబడుతోంది.
ఈ వీరభద్రస్వామికి జటావీరభద్రుడని పేరు.ద్విభుజుడైన ఈ వీరభద్ర స్వామి కుడి చేతిలో ఖడ్గాన్ని , ఎడమ చేతిలో డాలును ధరించియున్నాడు.స్వామికి కర్ణాభరణాలు , కంఠాభరణాలు అలంకరించబడివున్నాయి
ఈ స్వామికి కుడి వైపున ఆలయ గర్భాలయం , మరియు ఎడమవైపున మూసివేయబడిన ప్రదేశ మార్గాలు వుండటం చేత , ఈ స్వామి ప్రత్యేకంగా ఒక ఉపాలయంలో వున్నట్లుగా గోచరిస్తాడు.అంతేకాకుండా ఈ స్వామికి ఎదురుగా మండపానికి గల స్థంబాల నడుమ ద్వారబంధర కూడా నిర్మితమైనది.ఈ ద్వారబంధరం పై భాగంలో సాధారణ నిర్మాణంగా వున్నప్పటికి , ద్వార బంధరానికి ఇరువైపులా పూర్ణకలశాలు మలచబడ్డాయి.ఈ ద్వారబంధరంపై చెక్కబడిన ఒక శాసనంలో మల్లికర్జునాచార్యుని శిష్యుడు శ్రీ శైల క్షేత్ర మందు ఘంటాసిద్ధేశ్వరుని ప్రతిష్ఠించినట్లుగా పేర్కొనబడినట్లు ఇండియన్ ఎపిగ్రఫీ వార్షిక నివేదిక 42 / 1915 ద్వారా తెలుస్తోంది.అయితే ప్రస్తుతం ఈ శాసనం కనబడటం లేదు.బహుశా 1915 తరువాత ఈ ద్వారబంధరం పునర్మించబడివుండవచ్చు లేదా ద్వారబంధరం ఏమైనా మరమ్మతులు చేసి వుండవచ్చు ఈ సందర్భంలోనే ఈ శాసనం గల రాయి కనుమరుగైవుంటుంది.
ఈ ఆలయానికి ఉత్తర భాగంలో అంటే వీరభద్ర స్వామికి ఎదురుగా మరో రాతి మండపం నిర్మితమైవున్నది.ఈ మండపం ఆలయ ప్రాచీన మండపాన్ని , అంటే వీరభద్ర స్వామి నెలకొనియున్న మండపాన్ని అనుకునే నిర్మించబడివున్నది.మొత్తం 16 స్థంభాలను కూడి యున్న ఈ మండపంలో లోపలి వైపునే తూర్పు , పడమర , ఉత్తర భాగాలందు అరుగులు నిర్మించబడివున్నాయి.సాధారణంగా హోయ్సలుల కాలంలో (ఆంగ్ల శకం 9-10 శతాబ్దాలు) నిర్మించబడిన నిర్మాణాలలో లోపలివైపున ఇలాంటి అరుగులు నిర్మించబడివుంటాయి.శ్రీశైలంలోని శిఖరేశ్వర ఆలయ ముఖమండపంలో కూడా మనం ఇలాంటి అరుగులనే చూడవచ్చు.ఈ మండపానికి ఉత్తరవైపునే ప్రవేశద్వారం వుంది.
ఈ మండపంలోనే (వీరభద్ర స్వామి ఆలయ ద్వారానికి) ఇరువైపులా ఎంతో ప్రాచీనమైన రెండు సిద్ధపురషుల విగ్రహాలు కనిపిస్తాయి.
శ్రీశైలక్షేత్ర సిద్ధస్థలమైన కారణంగా , క్షేత్రంలో పలుచోట్ల ఈ సిద్ధుల విగ్రహాలు కనిపిస్తాయి.అగ్నిపురాణంలో శ్రీ శైలం సిద్ధక్షేత్రం గానే చెప్పబడింది.భవభూతి మాలతీ మాధవంలోనూ , హర్షుని రత్నావళి నాటకంలోనూ శ్రీ శైలంలో సిద్ధపురుషులుండేవారని చెప్పేందుకు ఆధారాలున్నాయి.
మన సంప్రదాయంలో సిద్ధపురషులంటే ఒక విధమైన జ్ఞానసంపన్నులనే భావన ప్రసిద్ధంగా వుంది.ఈ సిద్ధపురుషులు కొన్ని విచిత్ర శక్తులను కలిగివుండేవారని తెలుస్తోంది.వీరు ఆధ్యాత్మికoగానో యోగసాధనతోనో లేదా తాంత్రిక పద్దతిలోనో , మరే విధంగానైనా దైవానుగ్రహాన్ని పొంది తద్వారా జ్ఞానసిద్ధిని పొందిన మహనీయులు.వీరు భక్తులకు తమకు ఆశ్రయించినవారికి శుభత్త్వాన్ని , శ్రేయస్సును కలిగించేవారని చెబుతారు.
మొత్తం మీద శ్రీశైలంలోని ఈ మఠాలన్ని కూడా సిద్ధపురుషులకు ఆవాసంగా వుండేదని భావించడం సబబుగానే వుంటుంది.
ఈ స్వామికి కుడి వైపున ఆలయ గర్భాలయం , మరియు ఎడమవైపున మూసివేయబడిన ప్రదేశ మార్గాలు వుండటం చేత , ఈ స్వామి ప్రత్యేకంగా ఒక ఉపాలయంలో వున్నట్లుగా గోచరిస్తాడు.అంతేకాకుండా ఈ స్వామికి ఎదురుగా మండపానికి గల స్థంబాల నడుమ ద్వారబంధర కూడా నిర్మితమైనది.ఈ ద్వారబంధరం పై భాగంలో సాధారణ నిర్మాణంగా వున్నప్పటికి , ద్వార బంధరానికి ఇరువైపులా పూర్ణకలశాలు మలచబడ్డాయి.ఈ ద్వారబంధరంపై చెక్కబడిన ఒక శాసనంలో మల్లికర్జునాచార్యుని శిష్యుడు శ్రీ శైల క్షేత్ర మందు ఘంటాసిద్ధేశ్వరుని ప్రతిష్ఠించినట్లుగా పేర్కొనబడినట్లు ఇండియన్ ఎపిగ్రఫీ వార్షిక నివేదిక 42 / 1915 ద్వారా తెలుస్తోంది.అయితే ప్రస్తుతం ఈ శాసనం కనబడటం లేదు.బహుశా 1915 తరువాత ఈ ద్వారబంధరం పునర్మించబడివుండవచ్చు లేదా ద్వారబంధరం ఏమైనా మరమ్మతులు చేసి వుండవచ్చు ఈ సందర్భంలోనే ఈ శాసనం గల రాయి కనుమరుగైవుంటుంది.
ఈ ఆలయానికి ఉత్తర భాగంలో అంటే వీరభద్ర స్వామికి ఎదురుగా మరో రాతి మండపం నిర్మితమైవున్నది.ఈ మండపం ఆలయ ప్రాచీన మండపాన్ని , అంటే వీరభద్ర స్వామి నెలకొనియున్న మండపాన్ని అనుకునే నిర్మించబడివున్నది.మొత్తం 16 స్థంభాలను కూడి యున్న ఈ మండపంలో లోపలి వైపునే తూర్పు , పడమర , ఉత్తర భాగాలందు అరుగులు నిర్మించబడివున్నాయి.సాధారణంగా హోయ్సలుల కాలంలో (ఆంగ్ల శకం 9-10 శతాబ్దాలు) నిర్మించబడిన నిర్మాణాలలో లోపలివైపున ఇలాంటి అరుగులు నిర్మించబడివుంటాయి.శ్రీశైలంలోని శిఖరేశ్వర ఆలయ ముఖమండపంలో కూడా మనం ఇలాంటి అరుగులనే చూడవచ్చు.ఈ మండపానికి ఉత్తరవైపునే ప్రవేశద్వారం వుంది.
ఈ మండపంలోనే (వీరభద్ర స్వామి ఆలయ ద్వారానికి) ఇరువైపులా ఎంతో ప్రాచీనమైన రెండు సిద్ధపురషుల విగ్రహాలు కనిపిస్తాయి.
శ్రీశైలక్షేత్ర సిద్ధస్థలమైన కారణంగా , క్షేత్రంలో పలుచోట్ల ఈ సిద్ధుల విగ్రహాలు కనిపిస్తాయి.అగ్నిపురాణంలో శ్రీ శైలం సిద్ధక్షేత్రం గానే చెప్పబడింది.భవభూతి మాలతీ మాధవంలోనూ , హర్షుని రత్నావళి నాటకంలోనూ శ్రీ శైలంలో సిద్ధపురుషులుండేవారని చెప్పేందుకు ఆధారాలున్నాయి.
మన సంప్రదాయంలో సిద్ధపురషులంటే ఒక విధమైన జ్ఞానసంపన్నులనే భావన ప్రసిద్ధంగా వుంది.ఈ సిద్ధపురుషులు కొన్ని విచిత్ర శక్తులను కలిగివుండేవారని తెలుస్తోంది.వీరు ఆధ్యాత్మికoగానో యోగసాధనతోనో లేదా తాంత్రిక పద్దతిలోనో , మరే విధంగానైనా దైవానుగ్రహాన్ని పొంది తద్వారా జ్ఞానసిద్ధిని పొందిన మహనీయులు.వీరు భక్తులకు తమకు ఆశ్రయించినవారికి శుభత్త్వాన్ని , శ్రేయస్సును కలిగించేవారని చెబుతారు.
మొత్తం మీద శ్రీశైలంలోని ఈ మఠాలన్ని కూడా సిద్ధపురుషులకు ఆవాసంగా వుండేదని భావించడం సబబుగానే వుంటుంది.
ఆలయ గోపురం :
వీరభద్ర మఠ విమానం (గోపురం) నాగరశైలిలో నిర్మితమైవుంది.కోలగా వుండి మెట్లవంటి నిర్మాణాన్ని కలిగివున్న ఈ విమానం అమలక శిఖరాన్ని కలిగివుంది.’ఆమలకం’ అంటే ‘ఉసిరి’ అని అర్ధం ఉసిరికాయ ఆకారంలో వుండటం వల్లనే ఈ శిఖరాలకు ఆమలక శిఖరం అనే పేరొచ్చింది.
ఆలయ వాస్తుశైలిలో చాళుక్యుల నిర్మాణశైలి ప్రభావం గల ఇటువంటి మెట్లవంటి విమానగోపురాలన్ని సుమారుగా ఆంగ్ల శకం 7-11 శతాబ్దాల మధ్య నిర్మించబడ్డాయి.