సారంగధర మఠం
సారంగధర మఠం కూడా ప్రధాన ఆలయానికి పడమటి వైపునే దాదాపు రెండు కిలోమీటర్ల దూరంలో వుంది.
పూర్తిగా శిలానిర్మితమైన ఈ మఠం ఆంగ్ల శకం 11-12 శతాబ్దాలలో నిర్మితమైనట్లుగా ఊహించవచ్చు.ఇటీవల కాలంలో ఈ మఠం కొంత వరకు పునరుద్ధరించబడింది.
తూర్పు ముఖంగా గర్భాలయ , ముఖమండపాలతో కూడివున్న ఈ మఠం పొడవైన వసారాను కలిగివుంది.పొడవైన ఈ వసారా నాలుగు స్థంబాలను వరుసగా కూడి వుండి , దక్షిణం నుండి ఉత్తరం వైపుకు నిర్మితమై ఉంది.
ఇక ముఖమండపం 28 స్థంబాలను కలిగివుండి ఎంతో విశాలంగా నిర్మితమైంది.
గర్భాలయంలోని శివలింగానికి నిత్య పూజాదికాలు జరిపించబడుతున్నాయి.ఈ స్వామి సారంగ సిద్దేశ్వర లింగంగా పిలవబడుతున్నాడు.గర్భాలయ ద్వారబంధం పై భాగంలో గజలక్ష్మి , క్రింది వైపు ఇరు ప్రక్కలా శివలింగాలు మలచబడ్డాయి.
స్వామి వారికీ అభిముఖంగా ముఖమండపంలో నంధీశ్వరుడు నెలకొని వున్నాడు.
గోపుర నిర్మాణం
సారంగధర మఠగోపురం (విమానం) నాగరశైలిలో మెట్లవంటి నిర్మాణాన్ని కలిగివుంది.ఘంటా మఠ , భీమశంకర మఠ , వీర భద్ర మఠ విమానాలు కూడా ఇటువంటి నిర్మాణాలే.
చాళుక్యులు నిర్మాణశైలి ప్రభావంగల ఇటువంటి మెట్లవంటి విమాన గోపురాలన్ని ఆంగ్లశకం 7 వ శతాబ్దం నుండి 11 వ శతాబ్దం చివరికాలం వరకు నిర్మించబడ్డాయి.
వివిధ కాలాలలో ఎందరో సిద్ధపురుషులకు , శైవ గురువులకు , ఆధ్యాత్మిక సేవ నిరతులకు ఈ మఠం నెలవై వున్నట్లుగా తెలుస్తోంది
ఈ మఠానికి అనేక దానాలు ఇవ్వబడినట్లుగా కూడా చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి.
ఈ మఠం మెట్ల పైగల ఒక శాసనంలో సారంగ సిద్ధేశ్వరుని నిత్య సేవకు చనబోయని నరసయ్య కుమారుడు కోనయ కొంత దానాన్ని చేసినట్లుగా చెప్పబడింది.ఈ మెట్ల పై గల మరో శాసనంలో నిశాంకగుండి అనే ఆయన మరికొన్ని దానాలను ఇచ్చినట్లుగా చెప్పబడింది.లిపిని బట్టి ఈ రెండు శాసనాలు కూడా 13-14 శతాబ్దాల నాటివని భావించబడుతున్నాయి.
కాగా సారంగధరమఠంలో మరో విచిత్రమైన శాసనం కూడా కనబడుతోంది.తెలుగు లిపిలోని ఈ స్థంభంశాసనం శాలిశకం 1507 , పార్ధివ నామ సంవత్సరం (ఆంగ్లశకం 1585 ,సెప్టెంబర్ 30) నాటిది.
శ్రీ శైలం లోని నందిమఠం , భృoగి మఠం , వీరభద్ర మఠం మొదలైన మఠాలలో ముఖ్యమైన సారంగధర మఠంలో అన్ని మఠమూల ప్రధాన పూజారులు సమావేశమైనట్లు , సారంగధర మఠానికి ప్రధాన పూజారి అగుటకు ఎవరితోనైనా సిఫారసు చేయించినా , లంచములిచ్చినా వారు శిక్షార్హులని , అట్టి వారు గురువును గంగాతీరంలో వధించిన పాపాన పోతారని , ఈ విషయమై లంచాన్ని తీసుకొన్న వారు సంఘ విద్రోహులుగా పరిగణింపబడతారని తీర్మానించినట్లు పై శాసనం తెలియజేస్తోంది.
కాగా శ్రీ శైల క్షేత్రంలోని సిద్ధ సంప్రదాయాన్ని తెలియజెప్పే బ్రాహ్మిలిపిలోని ‘సరసపరమాత్మ ’ అనే 7వ శతాబ్ది నాటి శాసనం ఈ సారంగధర మఠానికి సమీపంలోనే నేల పై గల బండ పై చెక్కబడటం చెప్పుకోదగిన విషయం.శ్రీశైలంలో లభించిన శాసనాలలో ఈ సరస పరమాత్మ శాసనమే అత్యంత ప్రాచీనమైనది.
చాళుక్యులు నిర్మాణశైలి ప్రభావంగల ఇటువంటి మెట్లవంటి విమాన గోపురాలన్ని ఆంగ్లశకం 7 వ శతాబ్దం నుండి 11 వ శతాబ్దం చివరికాలం వరకు నిర్మించబడ్డాయి.
వివిధ కాలాలలో ఎందరో సిద్ధపురుషులకు , శైవ గురువులకు , ఆధ్యాత్మిక సేవ నిరతులకు ఈ మఠం నెలవై వున్నట్లుగా తెలుస్తోంది
ఈ మఠానికి అనేక దానాలు ఇవ్వబడినట్లుగా కూడా చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి.
ఈ మఠం మెట్ల పైగల ఒక శాసనంలో సారంగ సిద్ధేశ్వరుని నిత్య సేవకు చనబోయని నరసయ్య కుమారుడు కోనయ కొంత దానాన్ని చేసినట్లుగా చెప్పబడింది.ఈ మెట్ల పై గల మరో శాసనంలో నిశాంకగుండి అనే ఆయన మరికొన్ని దానాలను ఇచ్చినట్లుగా చెప్పబడింది.లిపిని బట్టి ఈ రెండు శాసనాలు కూడా 13-14 శతాబ్దాల నాటివని భావించబడుతున్నాయి.
కాగా సారంగధరమఠంలో మరో విచిత్రమైన శాసనం కూడా కనబడుతోంది.తెలుగు లిపిలోని ఈ స్థంభంశాసనం శాలిశకం 1507 , పార్ధివ నామ సంవత్సరం (ఆంగ్లశకం 1585 ,సెప్టెంబర్ 30) నాటిది.
శ్రీ శైలం లోని నందిమఠం , భృoగి మఠం , వీరభద్ర మఠం మొదలైన మఠాలలో ముఖ్యమైన సారంగధర మఠంలో అన్ని మఠమూల ప్రధాన పూజారులు సమావేశమైనట్లు , సారంగధర మఠానికి ప్రధాన పూజారి అగుటకు ఎవరితోనైనా సిఫారసు చేయించినా , లంచములిచ్చినా వారు శిక్షార్హులని , అట్టి వారు గురువును గంగాతీరంలో వధించిన పాపాన పోతారని , ఈ విషయమై లంచాన్ని తీసుకొన్న వారు సంఘ విద్రోహులుగా పరిగణింపబడతారని తీర్మానించినట్లు పై శాసనం తెలియజేస్తోంది.
కాగా శ్రీ శైల క్షేత్రంలోని సిద్ధ సంప్రదాయాన్ని తెలియజెప్పే బ్రాహ్మిలిపిలోని ‘సరసపరమాత్మ ’ అనే 7వ శతాబ్ది నాటి శాసనం ఈ సారంగధర మఠానికి సమీపంలోనే నేల పై గల బండ పై చెక్కబడటం చెప్పుకోదగిన విషయం.శ్రీశైలంలో లభించిన శాసనాలలో ఈ సరస పరమాత్మ శాసనమే అత్యంత ప్రాచీనమైనది.