జ్యోతిర్లింగాలలో ప్రముఖమైన మరియు అష్టా దశ శక్తి పీఠాలలో కూడా ప్రసిద్ధి గాంచిన శ్రీ శైలంలో షుమారు 7 వ శతాబ్ద కాలంలో నిర్మించ బడి అనేక సిద్ధ పురుషులకు ఆవాసముగా విరాజిల్లి మల్లిఖార్జున దేవస్థాన పరిపాలన భాద్యతలను వహించి , ఆదిశంకరాచార్యులు , శ్రీ పాద వల్లభుడు , వీర బ్రహ్మేంద్ర స్వామి , సనారి విశ్వేశ్వర స్వామి వంటి సిద్ధ పురుషులే గాక చరిత్రలో నిలిచిపోయిన శ్రీ కృష్ణ దేవారాయలు , ఛత్రపతి శివాజీ , చంద్ర గుప్త విక్రమాదిత్య వంటి రాజులకు వారి వారి ఆధ్యాత్మిక ప్రయాణంలో మజిలీలుగా ఉపయోగపడి అనేకము శిధిలమై పోగా మిగిలి ఉన్న పంచ మఠాల పునరుద్ధరణ - హిందూ వారసత్వ క్షేత్ర ప్రతీకలను భావి తరాల వారికీ అందించడం మనకు చారిత్రాత్మక కార్యము కాగలదు