ఘంటా మఠం
ఘంటామఠం శ్రీ శైల ప్రధానాలయానికి అత్యంత సమీపంలో , అంటే ఆలయ ప్రాకారానికి వాయువ్యదిశలో సుమారు 100 మీటర్ల దూరంలోనే ఉంది.అయిదు – ఆరు చిన్న – పెద్ద ఆలయాల సముదాయంతో కూడిన ఈ మఠం ఎన్నో సార్లు మార్పులకు చేర్పులకు గురైనట్లుగా పరిశీలనలో వెల్లడవుతున్నది.
శ్రీ శైలం లోని మఠాలన్నింటిలోకి ఈ ఘంటామఠమే అతి ప్రాచీనమైనది.ఈ మఠం యొక్క ఉనికి ఆంగ్ల శకం 7 వ శతాబ్ది నుండే తెలుస్తోంది.హర్షుని రత్నావళి నాటకంలో ప్రస్తావించబడిన ఘంటాసిద్దుడు ఈ మఠంలోనే వుండేవాడని ప్రతీతి.దీనిని బట్టి ఆంగ్ల శకం 7 వ శతాబ్దంలోనే ఈ మఠం ఉన్నట్లుగా తెలుస్తోంది
ప్రస్తుతం ఈ మఠంలో గల ఒక సిద్ధుని విగ్రహాన్ని ఘంటా సిద్దేశ్వరుని విగ్రహంగా పేర్కొంటున్నారు.
కాగా ఘంటామఠానికి పశ్చిమ నైరుతి లో గల వీరభద్రాలయ ద్వారబంధనం మీదగల శాసనంలో మల్లికార్జునాచార్యుల వారి శిష్యుడు శ్రీశైలంలో ఘంటాసిద్దేశ్వరుని ప్రతిష్ఠించినట్లుగా చెప్పబడింది.(ఇండియన్ ఎపిగ్రఫీ వార్షిక నివేదిక 42/1915).ఈ శాసనంలో పేర్కొనబడిన ఘంటాసిద్దేశ్వరుడు , ఘంటా మఠంలో ప్రస్తుతం కనిపిస్తున్న ఘంటాసిద్దేశ్వరుడు ఒక్కరే అయ్యుండొచ్చు.
ప్రస్తుతం ఘంటా మఠంలో తూర్పు ముఖంగా ఒక శివాలయం , ఉత్తర ముఖంగా ఇంకొక శివాలయము పడమర ముఖంగా మరో రెండు శివాలయాలున్నాయి.తూర్పు ముఖంగా ఉన్న ఆలయమే ఈ మఠంలోని ప్రధానాలయం.ఈ ప్రధానాలయానికి ఎడమ వైపున మరో చిన్న ఆలయం కూడా ఉన్నది.అయితే ప్రస్తుతం ఈ ఆలయంలో దేవతామూర్తులెవరూలేరు.ఇది కూడా శివాలయమే అయిండవచ్చు
ఈ అయిదు ఆలయాల విమానగోపురాలు కూడా మెట్ల వంటి నిర్మాణాలతో (Stepped Pyramidal) కోలగా వున్నాయి.ఇవన్ని రాతి నిర్మాణాలే .
శ్రీ శైలం లోని మఠాలన్నింటిలోకి ఈ ఘంటామఠమే అతి ప్రాచీనమైనది.ఈ మఠం యొక్క ఉనికి ఆంగ్ల శకం 7 వ శతాబ్ది నుండే తెలుస్తోంది.హర్షుని రత్నావళి నాటకంలో ప్రస్తావించబడిన ఘంటాసిద్దుడు ఈ మఠంలోనే వుండేవాడని ప్రతీతి.దీనిని బట్టి ఆంగ్ల శకం 7 వ శతాబ్దంలోనే ఈ మఠం ఉన్నట్లుగా తెలుస్తోంది
ప్రస్తుతం ఈ మఠంలో గల ఒక సిద్ధుని విగ్రహాన్ని ఘంటా సిద్దేశ్వరుని విగ్రహంగా పేర్కొంటున్నారు.
కాగా ఘంటామఠానికి పశ్చిమ నైరుతి లో గల వీరభద్రాలయ ద్వారబంధనం మీదగల శాసనంలో మల్లికార్జునాచార్యుల వారి శిష్యుడు శ్రీశైలంలో ఘంటాసిద్దేశ్వరుని ప్రతిష్ఠించినట్లుగా చెప్పబడింది.(ఇండియన్ ఎపిగ్రఫీ వార్షిక నివేదిక 42/1915).ఈ శాసనంలో పేర్కొనబడిన ఘంటాసిద్దేశ్వరుడు , ఘంటా మఠంలో ప్రస్తుతం కనిపిస్తున్న ఘంటాసిద్దేశ్వరుడు ఒక్కరే అయ్యుండొచ్చు.
ప్రస్తుతం ఘంటా మఠంలో తూర్పు ముఖంగా ఒక శివాలయం , ఉత్తర ముఖంగా ఇంకొక శివాలయము పడమర ముఖంగా మరో రెండు శివాలయాలున్నాయి.తూర్పు ముఖంగా ఉన్న ఆలయమే ఈ మఠంలోని ప్రధానాలయం.ఈ ప్రధానాలయానికి ఎడమ వైపున మరో చిన్న ఆలయం కూడా ఉన్నది.అయితే ప్రస్తుతం ఈ ఆలయంలో దేవతామూర్తులెవరూలేరు.ఇది కూడా శివాలయమే అయిండవచ్చు
ఈ అయిదు ఆలయాల విమానగోపురాలు కూడా మెట్ల వంటి నిర్మాణాలతో (Stepped Pyramidal) కోలగా వున్నాయి.ఇవన్ని రాతి నిర్మాణాలే .
ఈ మెట్లవంటి గోపుర నిర్మాణాలన్నీ కూడా చాళుక్యుల కాలంనాటి దేవాలయాలలో కనిపిస్తాయి.
ఆంగ్ల శకం 7-10 శతాబ్దాల మధ్య కాలంలో నిర్మించబడిన ఆలయాలలో మనం యిలాంటి మెట్ల వంటి విమాన గోపురాలను చూడవచ్చు . కాబట్టి ఘంటా మఠంలోని ఈ ఆలయాలు కూడా ఆంగ్ల శకం 7-8 శతాబ్దాలలో నిర్మించబడి వుంటాయని భావించడం సహేతుకమనిపిస్తుంది.
ఇక ఈ ఆలయ సముదాయానికి ఉత్తరంవైపున తూర్పు ఈశాన్యంలో ప్రవేశ ద్వారం వుంది.రాతి నిర్మితమైన ఈ ప్రవేశద్వారానికి యిరువైపులా ద్వార పాలకులు మలచబడ్డారు .ఈ ప్రవేశద్వారం ఆంగ్ల శకం 1314 , ఆనంద నామ సంవత్సర , శ్రావణ శుద్ధ పౌర్ణమి నాడు కట్టించ బడినట్లుగా ఆలయంలో మండపం పై గల ఒక శాసనం చెబుతోంది .
ఘంటా మఠంలోని ప్రధాన ఆలయాన్ని పరిశీలిస్తే , మొదటగా యిది గర్భాలయ , అంతరాలయ , ముఖ మండపాలతో నిర్మించబడినట్లు , చాలా కాలం తర్వాత ముఖ మండపానికి పడమటి వైపున అదనంగా మరో మండపం నిర్మించబడినట్లుగా తెలుస్తోంది.
ఇక అంతరాలయాన్ని ఆనుకొని నిర్మించిన మండపం అంటే ముఖ మండపం 16 స్థంబాలతో నిర్మించబడింది.కాగా ఈ ముఖ మండపాన్ని ఆనుకొని తరువాత కాలంలో నిర్మించబడిన మండపం 12 స్థంబాలతో నిర్మించబడివుంది (అయితే ప్రస్తుతం 10 స్థంబాలు మాత్రమే వున్నాయి)
ప్రధానాలయంలోని శివలింగానికి వ్యవహారంలో గల పేరు తెలియరాలేదు.ఈ శివలింగం , ఎప్పుడు ప్రతిష్ఠించబడిందో చెప్పే ఆధారాలు కూడా లభించలేదు.అయితే ఆలయ నిర్మాణ సమయంలోనే అంటే ఆంగ్ల శకం 7-8 శతాబ్దాలలో ఈ లింగం ప్రతిష్టించబడి వుండవచ్చు.ఈ శివ లింగంలో ఎంతో ప్రాచీనత గోచరించడం ఈ ఊహకు బలాన్ని చేకూరుస్తున్నది.
ఇక ఈ ఆలయంలోని ముఖమండపంలోని స్థంభం పై గల శాసనాన్ని బట్టి ఈ ముఖమండపం ఆంగ్లశకం 1314 వ సంవత్సరంలో శ్రీ శివయ్య అనే వ్యక్తీ నిర్మించి మల్లికార్జునస్వామి వారికి దానంగా సమర్పించినట్లుగా తెలుస్తోంది.ఇంకా శాసనంలో ఈ శివయ్య గారు బ్రహ్మ , విష్ణు , మహేశ్వరులను చెక్కించి ఈ మండపంలో ప్రతిష్టించినట్లుగా చెప్పబడింది.అయితే ఈ మండపంలో ప్రస్తుతం ఈ విగ్రహలేవి లేవు.
ఆంగ్ల శకం 7-10 శతాబ్దాల మధ్య కాలంలో నిర్మించబడిన ఆలయాలలో మనం యిలాంటి మెట్ల వంటి విమాన గోపురాలను చూడవచ్చు . కాబట్టి ఘంటా మఠంలోని ఈ ఆలయాలు కూడా ఆంగ్ల శకం 7-8 శతాబ్దాలలో నిర్మించబడి వుంటాయని భావించడం సహేతుకమనిపిస్తుంది.
ఇక ఈ ఆలయ సముదాయానికి ఉత్తరంవైపున తూర్పు ఈశాన్యంలో ప్రవేశ ద్వారం వుంది.రాతి నిర్మితమైన ఈ ప్రవేశద్వారానికి యిరువైపులా ద్వార పాలకులు మలచబడ్డారు .ఈ ప్రవేశద్వారం ఆంగ్ల శకం 1314 , ఆనంద నామ సంవత్సర , శ్రావణ శుద్ధ పౌర్ణమి నాడు కట్టించ బడినట్లుగా ఆలయంలో మండపం పై గల ఒక శాసనం చెబుతోంది .
ఘంటా మఠంలోని ప్రధాన ఆలయాన్ని పరిశీలిస్తే , మొదటగా యిది గర్భాలయ , అంతరాలయ , ముఖ మండపాలతో నిర్మించబడినట్లు , చాలా కాలం తర్వాత ముఖ మండపానికి పడమటి వైపున అదనంగా మరో మండపం నిర్మించబడినట్లుగా తెలుస్తోంది.
ఇక అంతరాలయాన్ని ఆనుకొని నిర్మించిన మండపం అంటే ముఖ మండపం 16 స్థంబాలతో నిర్మించబడింది.కాగా ఈ ముఖ మండపాన్ని ఆనుకొని తరువాత కాలంలో నిర్మించబడిన మండపం 12 స్థంబాలతో నిర్మించబడివుంది (అయితే ప్రస్తుతం 10 స్థంబాలు మాత్రమే వున్నాయి)
ప్రధానాలయంలోని శివలింగానికి వ్యవహారంలో గల పేరు తెలియరాలేదు.ఈ శివలింగం , ఎప్పుడు ప్రతిష్ఠించబడిందో చెప్పే ఆధారాలు కూడా లభించలేదు.అయితే ఆలయ నిర్మాణ సమయంలోనే అంటే ఆంగ్ల శకం 7-8 శతాబ్దాలలో ఈ లింగం ప్రతిష్టించబడి వుండవచ్చు.ఈ శివ లింగంలో ఎంతో ప్రాచీనత గోచరించడం ఈ ఊహకు బలాన్ని చేకూరుస్తున్నది.
ఇక ఈ ఆలయంలోని ముఖమండపంలోని స్థంభం పై గల శాసనాన్ని బట్టి ఈ ముఖమండపం ఆంగ్లశకం 1314 వ సంవత్సరంలో శ్రీ శివయ్య అనే వ్యక్తీ నిర్మించి మల్లికార్జునస్వామి వారికి దానంగా సమర్పించినట్లుగా తెలుస్తోంది.ఇంకా శాసనంలో ఈ శివయ్య గారు బ్రహ్మ , విష్ణు , మహేశ్వరులను చెక్కించి ఈ మండపంలో ప్రతిష్టించినట్లుగా చెప్పబడింది.అయితే ఈ మండపంలో ప్రస్తుతం ఈ విగ్రహలేవి లేవు.
ఇక ఈ ముఖ మండపాన్ని ఆనుకొని తరువాత కాలంలో నిర్మించబడిన మండపానికి ఉత్తరం వైపున దక్షిణ ముఖంగా గల ఆలయంలో ప్రస్తుతం ఒక శివ లింగం పూజలందుకుంటోంది.ఈ శివలింగానికి గల పేరు తెలియరాలేదు.ఈ ఆలయం కేవలం గర్భాలయాన్ని మాత్రమే కూడి వుంది.
ఇక పడమటి వైపున తూర్పు ముఖంగా గల రెండు ఆలయాలు గర్భాలయ , అంతరాలయాలను కూడి వున్నాయి.ఈ రెండు ఆలయాలలో కూడా శివలింగాలు పూజలందుకుంటున్నాయి.
ఈ ఆలయంలో కుడివైపున గల స్వామికి ‘ఘంటాసిద్దేశ్వరలింగం’ అని పేరు.ఇక ఎడమవైపున గల ఆలయంలోని స్వామి పేరు తెలియరాలేదు.ఈ మఠ ప్రాంగణంలో తూర్పు మరియు పడమటి ఆలయాల మధ్య భాగంలోని ప్రదేశం కొంత విశాలంగానే వుంది.
ఇక పడమటి వైపున తూర్పు ముఖంగా గల రెండు ఆలయాలు గర్భాలయ , అంతరాలయాలను కూడి వున్నాయి.ఈ రెండు ఆలయాలలో కూడా శివలింగాలు పూజలందుకుంటున్నాయి.
ఈ ఆలయంలో కుడివైపున గల స్వామికి ‘ఘంటాసిద్దేశ్వరలింగం’ అని పేరు.ఇక ఎడమవైపున గల ఆలయంలోని స్వామి పేరు తెలియరాలేదు.ఈ మఠ ప్రాంగణంలో తూర్పు మరియు పడమటి ఆలయాల మధ్య భాగంలోని ప్రదేశం కొంత విశాలంగానే వుంది.
నీటి కుండాలు
ఘంటామఠ ప్రాంగణంలో రెండు నీటి కుండాలు కనిపిస్తాయి.ఆలయ ప్రాంగణంలో తూర్పు ముఖంగా ఎడమ వైపున గల ఆలయానికి ఎదురుగా తూర్పుభాగాన వున్నా కుండానికి ఘంటా కుండం అని పేరు . గర్భాలయానికి వున్నట్లుగా ( తూర్పు , దక్షిణ , ఉత్తర భాగాలలో) మూడు వైపులా ఎత్తైన గోడలను మరియు పై కప్పును కలిగి వున్న ఈ కుండం ఎంతో మహిమాన్వితమైనదిగా ప్రసిద్ధికెక్కింది.
స్కాందపురాణంలోని శ్రీ శైల ఖండం ఈ ఘంటా కుండాన్ని పలుమార్లు ప్రస్తావించింది.ఆంగ్ల శకం 13 వ శతాబ్దం నాటి నిత్యనాధసిద్ధుడు తన రసరత్నాకరంలోని అష్టమోపదేశంలో ‘రసాయనఖండం’ అనే పేరుతో శ్రీ శైల మహిమలను ప్రస్తావించే సందర్భంలో కూడా ఈ ఘంటాకుండం యొక్క గొప్పతనాన్ని వివరించాడు.ఈ ఘంటాకుండంలో నీరు ఎంత తోడినా తగ్గదు.పూర్తి వేసవిలో సైతం కుండంలో నీరు తగ్గకపోవడం విశేషం.
ఈ ఘంటాకుండాన్ని ‘అమృతకుండం’ అనే పేరుతో కూడా పిలుస్తున్నారు.కాగా ఈ ఘంటాకుండానికి తూర్పువైపున బయటి వైపున మరో కుండం వుంది.స్థానికంగా ఈ కుండాన్ని సరస్వతి కుండం అనే పేరుతో పిలుస్తున్నారు.ఈ కుండంలో కూడా ఎప్పుడూ నీళ్లుంటాయి.
స్కాందపురాణంలోని శ్రీ శైల ఖండం ఈ ఘంటా కుండాన్ని పలుమార్లు ప్రస్తావించింది.ఆంగ్ల శకం 13 వ శతాబ్దం నాటి నిత్యనాధసిద్ధుడు తన రసరత్నాకరంలోని అష్టమోపదేశంలో ‘రసాయనఖండం’ అనే పేరుతో శ్రీ శైల మహిమలను ప్రస్తావించే సందర్భంలో కూడా ఈ ఘంటాకుండం యొక్క గొప్పతనాన్ని వివరించాడు.ఈ ఘంటాకుండంలో నీరు ఎంత తోడినా తగ్గదు.పూర్తి వేసవిలో సైతం కుండంలో నీరు తగ్గకపోవడం విశేషం.
ఈ ఘంటాకుండాన్ని ‘అమృతకుండం’ అనే పేరుతో కూడా పిలుస్తున్నారు.కాగా ఈ ఘంటాకుండానికి తూర్పువైపున బయటి వైపున మరో కుండం వుంది.స్థానికంగా ఈ కుండాన్ని సరస్వతి కుండం అనే పేరుతో పిలుస్తున్నారు.ఈ కుండంలో కూడా ఎప్పుడూ నీళ్లుంటాయి.
ఘంటామఠం – దేవతామూర్తులు
కుమారస్వామి
ఘంటామఠం ప్రాంగణంలో దక్షిణం వైపున అంటే ప్రధాన ఆలయానికి , పశ్చిమ ముఖంగా వున్న శివాలయానికి మధ్యన ఆరుముఖాలు గల కుమారస్వామి దర్శనమిస్తాడు.
అత్యంత సుందరంగా కనిపించే ఈ స్వామి విగ్రహం ఎంతో ప్రాచీనమైనదిగా గోచరిస్తోంది.అయితే ఈ స్వామికి ఘంటామఠం ప్రాంగణంలో ప్రత్యేకంగా ఆలయమేమి లేదు.చాలా కాలం నుండే యిక్కడ స్వామి పూజలందుకుంటున్నట్లుగా స్థానికంగా చెప్పబడుతోంది.
వేదికాసనంపై అర్ధాసన భంగిమలో ఆసీనుడైన ఈ స్వామి పీఠం పై ఎడమ పాదాన్ని ముడుచుకుని , కుడి పాదాన్ని క్రిందకు చాచినట్లుగా చూపబడ్డాడు.పీఠం పై స్వామి వాహనమైన నెమలి , ఒక సర్పాన్ని అణుచుతున్నట్లుగా చూపబడింది.
తన ఆరు శిరస్సులపై కీరీట మకుటం గల స్వామి , తన పన్నెండు చేతులలో కుడి వైపున క్రింది నుండి పైకి వరుసగా అక్షమాల , బాణం , ఖడ్గం , చక్రం , పాశం , త్రిశూలాన్ని ధరించి వుండగా , ఎడమ వైపున కమండలం , ధనుస్సు , డాలు , శంఖం , సర్పం , డమరుకాన్ని కలిగి వున్నాడు.వస్త్రాలంకృతమైన స్వామికి కర్ణాభరణాలు , కంఠాభరణాలు కూడా చూపబడ్డాయి.
ఈ కుమార స్వామి విగ్రహం రూపంలోనూ , ఆయుధాల ధారణలోనూ శ్రీ శైల ప్రధాన ఆలయ ప్రాంగణంలోని కుమార స్వామి విగ్రహాన్ని పూర్తిగా పోలివుండటం విశేషం.అయితే పరిమాణంలో మాత్రం రెండు విగ్రహాలకు కొంత వ్యత్యాసం వుంది.
కాగా ప్రధాన ఆలయ ప్రాంగణంలో నవ బ్రహ్మ ఆలయాల వరుసలో చివర గల కుమార స్వామి ఆలయం చాళుక్యుల కాలంలో , సుమారుగా ఆంగ్ల శకం 7-8 శతాబ్దాలలో నిర్మించినట్లుగా భావించబడుతోంది.కాబట్టి ఘంటామఠంలోని ఈ కుమారస్వామి విగ్రహం కూడా యించుమించుగా ఆంగ్ల శకం 7-8శతాబ్దాల నాటిదిగా ఊహించవచ్చు.
అత్యంత సుందరంగా కనిపించే ఈ స్వామి విగ్రహం ఎంతో ప్రాచీనమైనదిగా గోచరిస్తోంది.అయితే ఈ స్వామికి ఘంటామఠం ప్రాంగణంలో ప్రత్యేకంగా ఆలయమేమి లేదు.చాలా కాలం నుండే యిక్కడ స్వామి పూజలందుకుంటున్నట్లుగా స్థానికంగా చెప్పబడుతోంది.
వేదికాసనంపై అర్ధాసన భంగిమలో ఆసీనుడైన ఈ స్వామి పీఠం పై ఎడమ పాదాన్ని ముడుచుకుని , కుడి పాదాన్ని క్రిందకు చాచినట్లుగా చూపబడ్డాడు.పీఠం పై స్వామి వాహనమైన నెమలి , ఒక సర్పాన్ని అణుచుతున్నట్లుగా చూపబడింది.
తన ఆరు శిరస్సులపై కీరీట మకుటం గల స్వామి , తన పన్నెండు చేతులలో కుడి వైపున క్రింది నుండి పైకి వరుసగా అక్షమాల , బాణం , ఖడ్గం , చక్రం , పాశం , త్రిశూలాన్ని ధరించి వుండగా , ఎడమ వైపున కమండలం , ధనుస్సు , డాలు , శంఖం , సర్పం , డమరుకాన్ని కలిగి వున్నాడు.వస్త్రాలంకృతమైన స్వామికి కర్ణాభరణాలు , కంఠాభరణాలు కూడా చూపబడ్డాయి.
ఈ కుమార స్వామి విగ్రహం రూపంలోనూ , ఆయుధాల ధారణలోనూ శ్రీ శైల ప్రధాన ఆలయ ప్రాంగణంలోని కుమార స్వామి విగ్రహాన్ని పూర్తిగా పోలివుండటం విశేషం.అయితే పరిమాణంలో మాత్రం రెండు విగ్రహాలకు కొంత వ్యత్యాసం వుంది.
కాగా ప్రధాన ఆలయ ప్రాంగణంలో నవ బ్రహ్మ ఆలయాల వరుసలో చివర గల కుమార స్వామి ఆలయం చాళుక్యుల కాలంలో , సుమారుగా ఆంగ్ల శకం 7-8 శతాబ్దాలలో నిర్మించినట్లుగా భావించబడుతోంది.కాబట్టి ఘంటామఠంలోని ఈ కుమారస్వామి విగ్రహం కూడా యించుమించుగా ఆంగ్ల శకం 7-8శతాబ్దాల నాటిదిగా ఊహించవచ్చు.
కౌమారి
ఘంటా మఠ ప్రాంగణంలో ప్రధాన ఆలయానికి దక్షిణం వైపున ఒక చిన్న మందిరం లాంటి నిర్మాణం వుంది.ఈ మందిరంలో ఆరు ముఖాలు గల (ముందు మూడు ముఖాలు , వెనుక మూడు ముఖాలు) అమ్మ వారు దర్శనమిస్తుంది.స్థానికులు ఈ అమ్మ వారిని గాయత్రిగా భావిస్తున్నారు.కాని వాస్తవానికి ఈమె సప్తమాతృకలలో ఒకరైన కౌమారి.
బ్రాహ్మి , మహేశ్వరీ , కౌమారి , వైష్ణవి , వారాహి , ఇంద్రాణి , చాముండాలను సప్తమాతృకలంటారు.సాధారణంగా ఈ సప్తమాతృకల విగ్రహాలు ఒకే వరుసలో కుర్చునట్లుగా మలచబడి వుంటాయి.విడిగా ఎక్కడా కనిపించవు.
కాని శ్రీ శైల క్షేత్రంలో కౌమారి విడిగా కనిపించడం ఎంతో విశేషం.ఈ విగ్రహాన్ని ఎంతో అరుదైన రూపంగా పేర్కొనవచ్చు.కౌమారి దేవి ఈ విధంగా విడిగా మరెక్కడ కూడా వున్నట్లుగా తెలియరాలేదు.కాబట్టి ఈ విశేషాన్ని శ్రీ శైల క్షేత్రానికి మాత్రమే ప్రత్యేకంగా చెప్పవచ్చు.
బ్రాహ్మి , మహేశ్వరీ , కౌమారి , వైష్ణవి , వారాహి , ఇంద్రాణి , చాముండాలను సప్తమాతృకలంటారు.సాధారణంగా ఈ సప్తమాతృకల విగ్రహాలు ఒకే వరుసలో కుర్చునట్లుగా మలచబడి వుంటాయి.విడిగా ఎక్కడా కనిపించవు.
కాని శ్రీ శైల క్షేత్రంలో కౌమారి విడిగా కనిపించడం ఎంతో విశేషం.ఈ విగ్రహాన్ని ఎంతో అరుదైన రూపంగా పేర్కొనవచ్చు.కౌమారి దేవి ఈ విధంగా విడిగా మరెక్కడ కూడా వున్నట్లుగా తెలియరాలేదు.కాబట్టి ఈ విశేషాన్ని శ్రీ శైల క్షేత్రానికి మాత్రమే ప్రత్యేకంగా చెప్పవచ్చు.
కాగా వస్త్రలంకృతురాలై , నెమలి వాహనంగా పీఠం పై మలచబడిన ఆసనం పై ఆసీనురాలైన ఈ దేవి అర్ధాసన భంగిమలో ఎడమ కాలును మడిచి , కుడి కాలును సర్పాన్ని నోటకరుచుకొనివున్న నెమలి పై వుంచినట్లుగా చూపబడింది.ఇక ఈ అమ్మ వారి ఆరు ముఖాలు కేశబంధాలతో కూడిన మకుటాలను కలిగి వున్నాయి.అమ్మ వారు తన పన్నెండు చేతులతో కుడి వైపున క్రింది నుండి పైకి వరుసగా జపమాలాయుత చిన్ముద్ర , శూలము , పరశువు , ఖడ్గం , బాణం , శక్తి , ఆయుధాన్ని , అట్లే ఎడమవైపున తాళపత్రయుత వరదముద్ర , త్రిశూలం , అంకుశం , డాలు , ధనుస్సు , శక్తి ఆయుధాలను ధరించి వుంది.అమ్మ వారికి కర్ణాభరణాలు , వివిధ కంఠాభరణాలు అలంకరించబడివున్నాయి.ఈ తల్లి ఘంటామఠంలో ఎప్పుడు నెలకొల్పబడిందో తెలియరాలేదు.
ఎంతో మహిమాన్వితమైన ఈమూర్తి భక్తులు కోరిన కోర్కెలను తీరుస్తుందని నమ్మిక.అందుకే తరచుగా పలు ప్రాంతాల నుండి భక్తులు వచ్చి దీక్ష తో ఈ అమ్మ వారిని ఉపాసించి వెళుతుంటారు.
మరి కొందరు మానసిక ప్రశాంతత కోసం , అనారోగ్యం తొలగి ఆరోగ్యం కలిగేందుకు ఈమెను ధ్యానిస్తుoటారు.
ఘంటామఠం ఒకప్పుడు సిద్ధపురుషులకు ఆవాసంగా వుండేదని చెబుతారు.అందుకే ఈ మఠంలో చేసే ధ్యాన , జపాదులు , పారాయణాలు త్వరగా సిద్ధిస్తాయని భక్తులు విశ్వసిస్తారు.
ఎంతో మహిమాన్వితమైన ఈమూర్తి భక్తులు కోరిన కోర్కెలను తీరుస్తుందని నమ్మిక.అందుకే తరచుగా పలు ప్రాంతాల నుండి భక్తులు వచ్చి దీక్ష తో ఈ అమ్మ వారిని ఉపాసించి వెళుతుంటారు.
మరి కొందరు మానసిక ప్రశాంతత కోసం , అనారోగ్యం తొలగి ఆరోగ్యం కలిగేందుకు ఈమెను ధ్యానిస్తుoటారు.
ఘంటామఠం ఒకప్పుడు సిద్ధపురుషులకు ఆవాసంగా వుండేదని చెబుతారు.అందుకే ఈ మఠంలో చేసే ధ్యాన , జపాదులు , పారాయణాలు త్వరగా సిద్ధిస్తాయని భక్తులు విశ్వసిస్తారు.