విభూతి మఠం
ప్రధాన ఆలయానికి పడమటి వైపున సుమారు ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో విభూతి మఠం వుంది.నిర్మాణ శైలిని బట్టి ఈ మఠం 9-10 శతాబ్దాలలో నిర్మించబడినట్లుగా భావించవచ్చు.
దక్షిణాభిముఖంగావున్న ఈ మఠం పూర్తిగా రాతి నిర్మాణం.అయితే ఈ మఠంలోని స్థంబాలు , గోడలన్నీ కూడా గారసున్నంతో మెత్తబడివున్నాయి.
ఎంతో విశాలమైన ఈ మఠం కాలక్రమములో పలుసార్లు మార్పు చేర్పులకు గురైనట్లుగా కనబడుతోంది.
నిర్మాణంపరంగా చూస్తే విద్యార్ధుల విద్యాభ్యాసానికి , ఇంకా ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణకు అనువుగా వుండేటట్లుగా ఈ మఠం నిర్మించబడినట్లుగా తెలుస్తోంది.ఒకప్పుడు ఈ మఠంలో గురుపీఠం కూడా వుండేది.
దక్షిణాభిముఖంగావున్న ఈ మఠం పూర్తిగా రాతి నిర్మాణం.అయితే ఈ మఠంలోని స్థంబాలు , గోడలన్నీ కూడా గారసున్నంతో మెత్తబడివున్నాయి.
ఎంతో విశాలమైన ఈ మఠం కాలక్రమములో పలుసార్లు మార్పు చేర్పులకు గురైనట్లుగా కనబడుతోంది.
నిర్మాణంపరంగా చూస్తే విద్యార్ధుల విద్యాభ్యాసానికి , ఇంకా ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణకు అనువుగా వుండేటట్లుగా ఈ మఠం నిర్మించబడినట్లుగా తెలుస్తోంది.ఒకప్పుడు ఈ మఠంలో గురుపీఠం కూడా వుండేది.
ఈ మఠానికి దక్షిణభాగంలో 4 స్థంబాలతో కూడిన పొడవైన వసారా (ముఖ-మండపంలాగా) కనిపిస్తుంది.పడమటి నుండి తూర్పుకు విస్తరించిన ఈ మఠంలోని నాలుగు స్థంబాలు సాధారణ నిర్మాణ శైలిని కలిగి , ఒకే వరుసలో (పడమటి నుండి తూర్పుకు) వున్నాయి.
ఇక ఈ మఠం యొక్క ప్రవేశ ద్వారం కొంత అలంకారికంగానే మలచబడివుంది.ఈ ప్రవేశ ద్వారానికి ఇరువైపులా పూర్ణకుంభాలు చెక్కబడ్డాయి.ప్రవేశ ద్వారం పై భాగంలో ద్వారాలంకరణలు (కోలగా వుండే మెట్లను పోలిన అలంకరణలు) , పద్మాలు వున్నాయి.
మఠం లోపల మధ్య భాగంలో నాలుగు స్థంబాలు గల మండపం , మిగిలిన భాగం కన్నా రెండు అడుగుల లోతులో వుంది.దీని చుట్టూ 16 స్థంబాలు గల మండపం , మిగిలిన భాగం కన్నా రెండు అడుగుల లోతులో వుంది.దీని చుట్టూ 16 స్థంబాలు గల మండపం రెండడుగుల ఎత్తులో నిర్మించబడింది.
నాలుగు స్థంబాల లోతైన మండపం మధ్యభాగంలో ఒక శివలింగం కనిపిస్తోంది.ఇది ప్రతిష్ఠించిబడిన శివలింగం కాదు.ఇటీవల కాలంలో ఈ శివలింగం ఇక్కడ నెలకొల్పబడింది.
కాగా మఠం లోపలి భాగంలో కుడి ఎడమలలో ద్వారాలు.వీటికి ఒకప్పుడు రాతి తలుపులు ఉన్నట్లుగా ఆనవాళ్ళను బట్టి తెలుస్తోంది.ఈ రెండు ద్వారాల అవతలి భాగంలో అంటే ద్వారాల నుండి లోపలికి ప్రవేశిస్తే పొడవైన గదుల్లాంటి నిర్మాణాలు కనిపిస్తాయి.
కుడివైపునగల ద్వారబంధానికి రెండు వైపులా ద్వారపాలకులు , లతాలంకరణలు , ద్వారానికి పై భాగంలో శివలింగం , దానికి యిరువైపులా నందులు మలచబడి వున్నాయి.ఈ ద్వారబంధం కొంత అలంకారయుక్తంగానే కనిపిస్తోంది.
ఇక ఎడమవైపున గల ద్వార బంధం అలంకారాలేవి లేకుండా అతి సాధారణంగా కనిపిస్తోంది.ద్వారబంధం పై భాగంలో మాత్రం గణపతి దర్శనమిస్తున్నాడు.
మఠం మధ్యభాగంలోని పై కప్పు శిధిలం చేయబడింది.ఈ పై కప్పు షట్కోణాకృతిలో వున్నట్లుగా తెలుస్తోంది.
వెలుపలినుండి ప్రవేశించేందుకు మఠం పడమటి వైపు చిన్న ప్రవేశ మార్గం ఉంది.అయితే దీనికి ద్వారబంధమేదీలేదు.ప్రస్తుతం మఠం వెనుక భాగం నుండి కూడా ప్రవేశ మార్గం ఏర్పాటు చేయబడింది.
మఠం పై భాగంలో నలుమూలలలోనూ ఒకప్పుడు నందివిగ్రహాలు వున్నట్లుగా తెలుస్తోంది.ఇక మఠం పై భాగం నుండి వర్షపునీరు క్రిందకు వచ్చేందుకు వీలుగా దక్షిణ ముఖంగానే రాతి నిర్మితాలైన రెండు చిత్రనాళాలు కూడా వుండటం విశేషం.ఈ చిత్రనాళాలు ఆలయాలలో గర్భాలయం నుండి అభిషేక జలం వెలుపలకు వచ్చేందుకు ఏర్పాటు చేయబడిన నిర్మాల్యనాళంలాగా వున్నాయి.
ఇక ఈ మఠం యొక్క ప్రవేశ ద్వారం కొంత అలంకారికంగానే మలచబడివుంది.ఈ ప్రవేశ ద్వారానికి ఇరువైపులా పూర్ణకుంభాలు చెక్కబడ్డాయి.ప్రవేశ ద్వారం పై భాగంలో ద్వారాలంకరణలు (కోలగా వుండే మెట్లను పోలిన అలంకరణలు) , పద్మాలు వున్నాయి.
మఠం లోపల మధ్య భాగంలో నాలుగు స్థంబాలు గల మండపం , మిగిలిన భాగం కన్నా రెండు అడుగుల లోతులో వుంది.దీని చుట్టూ 16 స్థంబాలు గల మండపం , మిగిలిన భాగం కన్నా రెండు అడుగుల లోతులో వుంది.దీని చుట్టూ 16 స్థంబాలు గల మండపం రెండడుగుల ఎత్తులో నిర్మించబడింది.
నాలుగు స్థంబాల లోతైన మండపం మధ్యభాగంలో ఒక శివలింగం కనిపిస్తోంది.ఇది ప్రతిష్ఠించిబడిన శివలింగం కాదు.ఇటీవల కాలంలో ఈ శివలింగం ఇక్కడ నెలకొల్పబడింది.
కాగా మఠం లోపలి భాగంలో కుడి ఎడమలలో ద్వారాలు.వీటికి ఒకప్పుడు రాతి తలుపులు ఉన్నట్లుగా ఆనవాళ్ళను బట్టి తెలుస్తోంది.ఈ రెండు ద్వారాల అవతలి భాగంలో అంటే ద్వారాల నుండి లోపలికి ప్రవేశిస్తే పొడవైన గదుల్లాంటి నిర్మాణాలు కనిపిస్తాయి.
కుడివైపునగల ద్వారబంధానికి రెండు వైపులా ద్వారపాలకులు , లతాలంకరణలు , ద్వారానికి పై భాగంలో శివలింగం , దానికి యిరువైపులా నందులు మలచబడి వున్నాయి.ఈ ద్వారబంధం కొంత అలంకారయుక్తంగానే కనిపిస్తోంది.
ఇక ఎడమవైపున గల ద్వార బంధం అలంకారాలేవి లేకుండా అతి సాధారణంగా కనిపిస్తోంది.ద్వారబంధం పై భాగంలో మాత్రం గణపతి దర్శనమిస్తున్నాడు.
మఠం మధ్యభాగంలోని పై కప్పు శిధిలం చేయబడింది.ఈ పై కప్పు షట్కోణాకృతిలో వున్నట్లుగా తెలుస్తోంది.
వెలుపలినుండి ప్రవేశించేందుకు మఠం పడమటి వైపు చిన్న ప్రవేశ మార్గం ఉంది.అయితే దీనికి ద్వారబంధమేదీలేదు.ప్రస్తుతం మఠం వెనుక భాగం నుండి కూడా ప్రవేశ మార్గం ఏర్పాటు చేయబడింది.
మఠం పై భాగంలో నలుమూలలలోనూ ఒకప్పుడు నందివిగ్రహాలు వున్నట్లుగా తెలుస్తోంది.ఇక మఠం పై భాగం నుండి వర్షపునీరు క్రిందకు వచ్చేందుకు వీలుగా దక్షిణ ముఖంగానే రాతి నిర్మితాలైన రెండు చిత్రనాళాలు కూడా వుండటం విశేషం.ఈ చిత్రనాళాలు ఆలయాలలో గర్భాలయం నుండి అభిషేక జలం వెలుపలకు వచ్చేందుకు ఏర్పాటు చేయబడిన నిర్మాల్యనాళంలాగా వున్నాయి.
పాశుపత యంత్రం
ఈ మఠంలో పెద్ద నల్ల రాతి పై చెక్కబడిన పాశుపత యంత్రం వుండేది.ఈ యంత్రాన్ని ప్రస్తుతం ప్రధాన ఆలయ ప్రాంగణంలోని జ్వాలావీరభద్ర ఆలయ ముఖ మండపంలో నెలకొల్పజేయడం జరిగింది.ఒకప్పుడు ఈ యంత్రం పై వుంచబడిన విభూతిని భక్తులు ధరించేవారు.ఈ కారణంగానే ఈ మఠానికి ‘విభూతి మఠం ’ అనే పేరు ఏర్పడిందని భావించవచ్చు.
చారిత్రక అంశాలు
1980 వ దశకానికి ముందు ఈ మఠంలో ఒక విగ్రహం వుండేది.ఈ విగ్రహ పీఠం పై చెక్కబడిన 14 వ శతాబ్దం నాటి ఒక శాసనంలో హోయసల వీరబల్లాలదేవ మహారాజు రాజ్యంలో దండనాయకునిగా పని చేస్తున్న అమితె దండనాయకుని సోదరుడు కలిదండనాయకుడు ప్రస్తావించబడ్డాడు.
పంచమఠాలలోని తక్కిన మఠాల కంటే కూడా నిర్మాణపరంగా కొంత ప్రత్యేకతను కలిగి వున్న ఈ మఠం వివిధ శైవ సంప్రదాయాలకు చెందిన శాఖామఠాధిపతులకు , వారి ఆధ్యాత్మిక కార్యకలాపాలకు , విద్యార్ధుల విద్యాభ్యాసానికి నెలవై వుండవచ్చు.
పంచమఠాలలోని తక్కిన మఠాల కంటే కూడా నిర్మాణపరంగా కొంత ప్రత్యేకతను కలిగి వున్న ఈ మఠం వివిధ శైవ సంప్రదాయాలకు చెందిన శాఖామఠాధిపతులకు , వారి ఆధ్యాత్మిక కార్యకలాపాలకు , విద్యార్ధుల విద్యాభ్యాసానికి నెలవై వుండవచ్చు.
ఇతర నిర్మాణాలు
విభూతి మఠానికి కుడివైపున అంటే నైరుతి మూలలో శిధిలమైన ఒక చిన్న మండపం కనిపిస్తుంది.ఈ మండపం కూడా శిలానిర్మితమే.ఈ మండపం వెనుక ఒక దిగుడుబావి వుంది.
ప్రధాన రహదారి నేలమట్టానికి కొంతలోతైన ప్రదేశంలో నిర్మించబడిన ఈ మఠం వద్దకు ప్రవేశించేందుకు ప్రాచీన కాలంలోనే మెట్ల మార్గం నిర్మించబడింది మఠం ముందు భాగంలో ప్రాచీనమైన రెండు నందిస్థంబాలు కనిపిస్తున్నాయి.
ప్రధాన రహదారి నేలమట్టానికి కొంతలోతైన ప్రదేశంలో నిర్మించబడిన ఈ మఠం వద్దకు ప్రవేశించేందుకు ప్రాచీన కాలంలోనే మెట్ల మార్గం నిర్మించబడింది మఠం ముందు భాగంలో ప్రాచీనమైన రెండు నందిస్థంబాలు కనిపిస్తున్నాయి.