భీమ శంకర మఠం
ఘంటామఠం తరువాత ప్రధాన ఆలయానికి దగ్గరగా వున్న మఠం భీమ శంకర మఠమే.
ఈ మఠం ఘంటామఠానికి వెనుక భాగంలో సుమారు 100 అడుగుల దూరంలో వుంది.
భీమశంకరమఠానికి మఠలక్షణాలేవి అంతగా కన్పించవు.వాస్తవానికి యిది ఒక ఆలయం.గర్భాలయం , అంతరాలయం , ముఖమండపాలతో కూడివున్న ఈ మఠం పూర్తిగా ఆలయ లక్షణాలను కలిగివుండి చూసేందుకు ఎంతో సుందరంగా కనబడుతోంది.
ఈ మఠం ఘంటామఠానికి వెనుక భాగంలో సుమారు 100 అడుగుల దూరంలో వుంది.
భీమశంకరమఠానికి మఠలక్షణాలేవి అంతగా కన్పించవు.వాస్తవానికి యిది ఒక ఆలయం.గర్భాలయం , అంతరాలయం , ముఖమండపాలతో కూడివున్న ఈ మఠం పూర్తిగా ఆలయ లక్షణాలను కలిగివుండి చూసేందుకు ఎంతో సుందరంగా కనబడుతోంది.
గోపుర నిర్మాణం
భీమ శంకర మఠ గోపురం (విమానం) నాగరశైలిలో మెట్ల వంటి నిర్మాణాన్ని కలిగివుంది.నిర్మాణశైలిని బట్టి ఈ విమానం పై అమలక శిఖరం వుండినట్లుగాతోస్తోంది.అమలకం అంటే ‘ఉసిరి’ అని అర్ధం.ఉసిరి కాయ ఆకారంలో వుండటం వల్లనే ఈ ఆలయ శిఖరాలకు అమలక శిఖరం అనే పేరొచ్చింది.ఘంటా మఠ ఆలయ విమానం కూడా యిలాంటి నాగరశైలి నిర్మాణమే.శ్రీ శైల ప్రధాన ఆలయానికి ఎదురుగా , రధవీధికి యిరువైపులా సాలుమండపాలలో గల అష్టమూర్తి శివాలయాలన్ని కూడా ఈ నాగరశైలి గోపురాలనే కలిగివున్నాయి.
ఆలయ తీరుతెన్నులు
భీమ శంకర ఆలయం తూర్పుముఖంగా వుంది.గర్భాలయం , అంతరాలయం , ముఖమండపంతో కూడి వున్న ఈ ఆలయంలో గర్భాలయం 7.5 అడుగుల వెడల్పును కలిగివుంది.అంతరాలయ ద్వారబంధం కూడా ఎంతో సాధారణ శైలిలోనే నిర్మితమైంది.
ముఖమండపం చతురస్రాకారంలో 24 అడుగుల పొడవుతో అంతే వెడల్పును కలిగివుంది. ముఖ మండప స్తంభాలు కొంత అలంకారయుక్తంగా చెక్కబడ్డాయి.ఈ మండపం పై భాగంలో మధ్యలో షట్కోణాన్ని చూడవచ్చు.మొత్తం మీద ఈ ముఖమండపం ఎంతో సుందరంగా కనిపిస్తుంది.
కాగా ఈ ముఖమండప స్థంభాలలో నైరుతి స్థంభంపై ఒక శాసనం కనిపిస్తోంది.ఆంగ్ల శకం 1298 నాటి ఈ శాసనంలో పండితారాధ్య విభూతి గారు ప్రస్తావించబడ్డారు.ఈ శాసనంలో తక్కిన విశేషాలు అంత స్పష్టంగా కనబడటంలేదు (ఈ శాసనం అముద్రితం)
మొత్తం మీద ఈ ఆలయంలోని 1298 నాటి ఈ శాసనాన్ని బట్టి భీమశంకర మఠం అప్పటికే అంటే 1298 నాటి ముందుకాలంలో నిర్మించబడి వుందని భావించవచ్చు . కాని ఈ శాసనం 1298 లోనే నిర్మించబడి వుంటుందని కొందరు భావిస్తున్నారు.అయితే నిర్మాణశైలిని బట్టి అంతకు ముందుకాలంలోనే ఈ ఆలయం నిర్మితమై వుంటుందని ఊహించడం సహేతుకమనిపిస్తుంది.ఆలయ నిర్మాణం జరిగిన చాలా కాలం తర్వాతనే ముఖమండప స్థంభం పై ఈ శాసనాన్ని చెక్కి వుండవచ్చు.
ముఖమండపం చతురస్రాకారంలో 24 అడుగుల పొడవుతో అంతే వెడల్పును కలిగివుంది. ముఖ మండప స్తంభాలు కొంత అలంకారయుక్తంగా చెక్కబడ్డాయి.ఈ మండపం పై భాగంలో మధ్యలో షట్కోణాన్ని చూడవచ్చు.మొత్తం మీద ఈ ముఖమండపం ఎంతో సుందరంగా కనిపిస్తుంది.
కాగా ఈ ముఖమండప స్థంభాలలో నైరుతి స్థంభంపై ఒక శాసనం కనిపిస్తోంది.ఆంగ్ల శకం 1298 నాటి ఈ శాసనంలో పండితారాధ్య విభూతి గారు ప్రస్తావించబడ్డారు.ఈ శాసనంలో తక్కిన విశేషాలు అంత స్పష్టంగా కనబడటంలేదు (ఈ శాసనం అముద్రితం)
మొత్తం మీద ఈ ఆలయంలోని 1298 నాటి ఈ శాసనాన్ని బట్టి భీమశంకర మఠం అప్పటికే అంటే 1298 నాటి ముందుకాలంలో నిర్మించబడి వుందని భావించవచ్చు . కాని ఈ శాసనం 1298 లోనే నిర్మించబడి వుంటుందని కొందరు భావిస్తున్నారు.అయితే నిర్మాణశైలిని బట్టి అంతకు ముందుకాలంలోనే ఈ ఆలయం నిర్మితమై వుంటుందని ఊహించడం సహేతుకమనిపిస్తుంది.ఆలయ నిర్మాణం జరిగిన చాలా కాలం తర్వాతనే ముఖమండప స్థంభం పై ఈ శాసనాన్ని చెక్కి వుండవచ్చు.