రుద్రాక్ష మఠం
పంచ మఠాలలో ఒకటైన రుద్రాక్ష మఠం భీమశంకర మఠానికి వెనుక భాగంలో వుంది.శ్రీ శైల ప్రధాన ఆలయానికి సుమారు 1 కి.మీ దూరంలోని ఈ మఠం కొంత విశాలంగానే వుంది .
తూర్పు ముఖంగా గర్భాలయం , ముఖ మండపాలను కూడి వున్న ఈ మఠం వెలుపలి వైపు ముందు భాగంలో ఆరు స్థంబాలతో కూడి వసారాలను కలిగివుంది.ఈ వసారాలో ఎడమవైపున (దక్షిణభాగంలో) సుమారు 10 అడుగుల ఎత్తైన పుట్ట దర్శనమిస్తుంది.సుమారు 7.50 అడుగుల పొడవు , అంతే వెడల్పు గల ఇక్కడ గర్భాలయంలో ఎంతో సుందరమైన శివలింగం దర్శనమిస్తుంది.రుద్రాక్షమాలను కలిగివున్నట్లుగా మలచబడిన ఈ శివలింగానికి జటాజూటం కూడా చూపబడింది.భక్తులు ఈ శివలింగానికి నిత్యార్చనలను నిర్వహిస్తున్నారు.గర్భాలయానికి ఎదురుగా సుందరమైన నల్లరాతి నంది విగ్రహం కనిపిస్తుంది.
ఇక గర్భాలయ ద్వార బంధరంపై భాగంలో ఇరువైపులా ఏనుగుల గల శివ లింగం మలచబడివుంది.ఈ శిల్పంలో ఏనుగులు శివలింగాన్ని అర్చిస్తున్నట్లుగా (పుష్పమాలను సమర్పిస్తున్నట్లుగా) చూపబడింది.ఆలయాలలో సాధారణంగా ద్వారబంధరంపై ఎక్కువగా గజలక్ష్మి మలచబడివుంటుంది.ఇక్కడ ఏనుగులు అర్చిస్తున్న శివలింగం మలచబడివుండటాన్ని ఎంతో అరుదైన అంశంగా చెప్పవచ్చు.
తూర్పు ముఖంగా గర్భాలయం , ముఖ మండపాలను కూడి వున్న ఈ మఠం వెలుపలి వైపు ముందు భాగంలో ఆరు స్థంబాలతో కూడి వసారాలను కలిగివుంది.ఈ వసారాలో ఎడమవైపున (దక్షిణభాగంలో) సుమారు 10 అడుగుల ఎత్తైన పుట్ట దర్శనమిస్తుంది.సుమారు 7.50 అడుగుల పొడవు , అంతే వెడల్పు గల ఇక్కడ గర్భాలయంలో ఎంతో సుందరమైన శివలింగం దర్శనమిస్తుంది.రుద్రాక్షమాలను కలిగివున్నట్లుగా మలచబడిన ఈ శివలింగానికి జటాజూటం కూడా చూపబడింది.భక్తులు ఈ శివలింగానికి నిత్యార్చనలను నిర్వహిస్తున్నారు.గర్భాలయానికి ఎదురుగా సుందరమైన నల్లరాతి నంది విగ్రహం కనిపిస్తుంది.
ఇక గర్భాలయ ద్వార బంధరంపై భాగంలో ఇరువైపులా ఏనుగుల గల శివ లింగం మలచబడివుంది.ఈ శిల్పంలో ఏనుగులు శివలింగాన్ని అర్చిస్తున్నట్లుగా (పుష్పమాలను సమర్పిస్తున్నట్లుగా) చూపబడింది.ఆలయాలలో సాధారణంగా ద్వారబంధరంపై ఎక్కువగా గజలక్ష్మి మలచబడివుంటుంది.ఇక్కడ ఏనుగులు అర్చిస్తున్న శివలింగం మలచబడివుండటాన్ని ఎంతో అరుదైన అంశంగా చెప్పవచ్చు.
ఇక ద్వారబంధరానికి ఇరు వైపులా (ద్వారపాలకుల స్థానంలో) కుడివైపున చామర సుందరి శిల్పాలు మలచబడివున్నాయి
కాగా దాదాపు 34 అడుగుల పొడవు , 44 అడుగుల వెడల్పు గల యిక్కడి మండపం 24 స్థంబాలను కూడి వుంది.
తూర్పు వైపున ప్రవేశ ద్వారం గల ఈ మండపానికి ఉత్తరం వైపున కూడా మరో ప్రవేశ ద్వారం వుంది.ముఖ మండపానికి లోపలి వైపున పశ్చిమ , దక్షిణ , ఉత్తరం వైపులలో అరుగులు నిర్మించబడివున్నాయి.
కాగా ఈ ముఖమండపంలో దక్షిణం వైపున , రెండు స్థంబాల నడుమ మరో ఉపాలయం కనిపిస్తోంది.ద్వారబంధరం గల ఈ ఉపాలయంలో ప్రస్తుతం దేవతా విగ్రహం లేదు.
ఈ ఉపాలయ ద్వార బంధరం పై భాగంలో (సాధారణంగా గజలక్ష్మి కనిపించేచోట) వృషభారూఢ మూర్తి (నందివాహనుడైన శివుడు) మలచబడ్డాడు.అదే విధంగా ద్వారబంధరం ఇరువైపులా ద్వారపాలకులు మలచబడ్డారు.
కాగా దాదాపు 34 అడుగుల పొడవు , 44 అడుగుల వెడల్పు గల యిక్కడి మండపం 24 స్థంబాలను కూడి వుంది.
తూర్పు వైపున ప్రవేశ ద్వారం గల ఈ మండపానికి ఉత్తరం వైపున కూడా మరో ప్రవేశ ద్వారం వుంది.ముఖ మండపానికి లోపలి వైపున పశ్చిమ , దక్షిణ , ఉత్తరం వైపులలో అరుగులు నిర్మించబడివున్నాయి.
కాగా ఈ ముఖమండపంలో దక్షిణం వైపున , రెండు స్థంబాల నడుమ మరో ఉపాలయం కనిపిస్తోంది.ద్వారబంధరం గల ఈ ఉపాలయంలో ప్రస్తుతం దేవతా విగ్రహం లేదు.
ఈ ఉపాలయ ద్వార బంధరం పై భాగంలో (సాధారణంగా గజలక్ష్మి కనిపించేచోట) వృషభారూఢ మూర్తి (నందివాహనుడైన శివుడు) మలచబడ్డాడు.అదే విధంగా ద్వారబంధరం ఇరువైపులా ద్వారపాలకులు మలచబడ్డారు.